SRPT: మంచ్య తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల వేషధారణలో చిన్నారులు అలరించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, బాధ్య తాభావంతో తరగతులు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామిరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.