MHBD: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కురవి వీరభద్రస్వామి ఆలయ పురోహితులు పెనుగొండ నాగేందర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయంలోని పురోహిత సమస్యపై ఆయన మంత్రికి వివరించారు. ఈ విషయమై ఆలయ ఈవోతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.