మేడ్చల్: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్లో 366వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులర్పించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా నాగర్ కర్నూల్లో చాకలి కులస్తులపై అగ్రకుల నేతల దాడి, 2 నెలల పసికందు మృతి దురదృష్టరమని అన్నారు.