సూర్యాపేట: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని 69 కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టరు పెండెo వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అల్పాహారం తీసుకుని, వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు.