MNCL: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా తీర్పునిచ్చారు. క్యాతన్ పల్లికి చెందిన అశోక్ కుమార్ లడ్డా వద్ద నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో శిక్ష విధించారు.