MDCL: ఉప్పల్ డివిజన్ పరిధిలోని పది కాలనీ సంఘాలు పైప్లైన్ పనులపై ఆందోళన వ్యక్తం చేశాయి. గణేశ్నగర్ నుంచి చిలుకానగర్ రహదారిలో తవ్వకాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని డిప్యూటీ కమిషనర్ జి. రాజుకు ఫిర్యాదు చేశారు. చిన్న పనులకు ఎక్కువ దూరం తవ్వకాలు చేయడం, కేబుల్, డ్రైనేజీ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నేతలు పేర్కొన్నారు.