HNK: భీమదేవరపల్లి (M) మల్లారంలో ఇవాళ 11 కేవీ విద్యుత్ వైరు అకస్మాత్తుగా తెగి ఇతర వైర్ల పై పడటంతో షాక్కు గురై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద పిండి మిషన్ నడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.