WGL: రాయపర్తి మండల కేంద్రంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు యువకులు గాయపడ్డారు. జేతురాం తండా పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తండాకు చెందిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా నేడు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రాయపర్తి నుంచి తండాకు వెళ్తుండగా కారు రహదారి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.