JGL: రాయికల్ పట్టణంలోని అంగన్వాడి- 1 కేంద్రంలో మంగళవారం టీహెచ్ ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సీడీపీవో జయప్రద గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్యం, శారీరక అభివృద్ధి కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.