JN: పాలకుర్తి నియోజకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. పాలకుర్తిలో ఓ టీ పాయింట్ వద్ద స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే టీ తాగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేవకులుగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని, పాలకుర్తి అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.