SDPT: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ పరీక్షలపై CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.