నిర్మల్ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గ తొలి సమావేశం శుక్రవారం జరిగింది. మున్సిపల్ ఛైర్పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేశ్ చక్రవర్తి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో 42 వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, మున్సిపాలిటీ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం వల్ల సమావేశం సమర్థవంతంగా సాగింది.