SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలను అంతర్జాతీయ కోచ్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కబడ్డీ ఆడుతున్న విద్యార్థులతో కరచాలనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.