NLG: చండూరు మండలం తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొత్తం రూ.18,08,120 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు. కొబ్బరికాయల వేలం, లడ్డు, పులిహోర విక్రయాలు, పూజా టికెట్లు, హుండీలు, కళ్యాణం, రథోత్సవ కట్నాల ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.