JGL: వేసవికాలం దృష్ట్యా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పెగడపల్లి మండల వ్యాప్తంగా ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పెగడపల్లి ఎంఈవో సులోచన తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వుల మేరకు, విద్యాశాఖ నిర్ణయం ప్రకారం ఈ విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ ఏప్రిల్ 21 వరకు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల నిర్వహించాలన్నారు.