PDPL: పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా,ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కన్నారు.