KMM: రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.