NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిట్యాల పీఎంశ్రీ జి.ప.ఉ. పాఠశాలలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను హెచ్ఎం బోడ సుశీల శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో శనివారం నిర్వహించే సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తమ మేధాశక్తిని ఉపయోగించి ఆవిష్కరణలను ప్రదర్శించాలని చెప్పారు.