NGKL: శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో NGKL జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన పంపూరం ఆంజనేయులు (38) గాయపడి, శుక్రవారం వెల్దండ ఆసుపత్రిలో మృతి చెందారు. కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.