NGKL: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి వార్డు సభలు నిర్వహించినట్లు గురువారం మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7,16,17,8,9,10 తదితర వార్డులలో జరిగిన వార్డు సభలలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.