E.G: భారత చైతన్య యువజన (బీసీ వై) పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఇంటింటికి బీసీ చైతన్యం కార్యక్రమం నిర్వహించారు. బీసీల హక్కుల సాధన కోసం పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరిలో ఆమరణ దీక్ష చేపడుతున్నారని వారు వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని తెలిపారు.