VSP: మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విశాఖలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అమోఘమన్నారు.