శ్రీకాకుళంలో బాల భవన్ నందు సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ కాంతారావు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 15న మంత్రి లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.