NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మైసిగండిలో నూతన ఇళ్లను ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.