NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.