SRD: ఉపాధ్యాయులకు కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం సరి కాదన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.