PDPL: ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మారంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, మండలాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.