NLG: నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం 7 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు నార్కెట్పల్లి టౌన్ (జంక్షన్ నుంచి కామినేని వైపు), మాధవ ఎడవల్లి అగ్రికల్చర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ ఏఈ చంద్రశేఖర రావు తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాలకు మాత్రం విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.