జగిత్యాల జిల్లాలో పండే ప్రధాన పంటల్లో ఒకటైన పసుపు పంట రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓట్ల ఏటీఎం గానే పనిచేస్తుంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన నాయకుల హామీలు నీటి మూటలుగానే నిలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ. 9వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుంది.