JGL: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా మొరం తరలిస్తున్న టిప్పర్ వాహనం శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనం వేగంగా మలుపు తిరుగుతుండగా నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. వాహనం దెబ్బతినడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.