HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ వెస్ట్ మారేడ్పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.