MNCL: ఉద్యోగులు రక్షణ చర్యలు పాటిస్తూ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్కే 5 గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులు సమన్వయంతో కృషి చేసి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అనంతరం గత నెలలో అత్యధిక టబ్బులు నింపిన ఎస్డీఎల్ ఆపరేటర్లకు బహుమతులు అందజేశారు.