NRPT: నర్వ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ (NREGS) నిధులతో చేపట్టిన ఈ పనులను బీజేపీ మండల అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి ఇతర నేతలు ప్రారంభించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.