RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.