KMM: బోనకల్లు మండలం గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, నిరుపేద కుటుంబాలకు మంజూరు చేయలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.