NRML: జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరిసర ప్రాంతంలో ఆదిమానవులు ఉపయోగించిన మెగాలిథిక్ మైక్రోలిథ్స్ టూల్స్ పరిశ్రమ ఆనవాళ్లు నేడు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. రాతి పరుపులపై కనిపించే గ్రూవ్స్ ద్వారా రాతి గొడ్డళ్ళు, బాణాల అంచులు, వేటకు ఉపయోగించే ఆయుధాలను తయారు చేసుకున్నట్లు వారు తెలిపారు.