MBNR: మహబూబ్ నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల పాటు గ్రూప్-1,2,3,4, ఆర్ఆర్బీ బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.