JN: మాన్సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీను ఉపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ మృతి చెందాడు. బాధితుడి బంధువులు, స్థానిక నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, మృతదేహం త్వరగా చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు