NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర కమిటీ నియమించింది. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.