KMR: జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారాంతపు, రోజువారీ సంతల వేలం పాటను శనివారం నిర్వహించారు. సర్పంచ్ సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ వేలం ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ప్రతి గురువారం జరిగే వారాంతపు సంతను జావిద్ బాగ్ వాన్ అత్యధికంగా రూ. 3,25,000 చెల్లించి వేలంలో దక్కించుకున్నారు.