JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్, వేములకుర్తి, వర్షకొండ గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఇటీవల తీర్మానం చేశాయి. నాసిరకం ఐస్ క్రీమ్లను విక్రయిస్తుండడంతో చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, ఐస్ క్రీమ్ విక్రయించే వాహనాలను నిషేధిస్తున్నామని, ఎవరైనా వచ్చి విక్రయిస్తే రూ.5వేల జరిమనా విధిస్తామన్నారు.