వనపర్తి మండలం చిట్యాలలో అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది ఐక్య రాజ్య సమితి ప్రకటించిన “నీరు, లింగ సమానత్వం” (Water and Gender) థీమ్పై సాంస్కృతిక సారధి కళాబృందం పాటల ద్వారా అవగాహన కల్పించారు. నీటిని ఆదా చేస్తూ, మహిళా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.