KMM: మధిర పట్టణంలోని టౌన్-2 బస్ డిపో ఫీడర్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బస్ డిపో ఏరియా, శ్రీనగర్ కాలనీ, అగ్రికల్చరల్ ఫారం రోడ్డు, సుందరయ్య నగర్, హనుమాన్ కాలనీ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.