SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి ఏప్రిల్ 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బలవంతంగా సంస్థలు మూసివేయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ కార్యక్రమానికైనా ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.