NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.