SRCL: వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్ పరిశీలించి.. సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు.