సత్యసాయి: కూటమి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తెలిపారు. గోరంట్లలో మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు బుధవారం అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త నిమ్మల యువశేఖర్తో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిరుపేదలకు ఆమె తోపుడు బండ్లను పంపిణీ చేసి, అభిమానులకు అన్నదానం చేశారు.