MNCL: తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ కారులకు ప్రతి నెల రూ.50 వేల పెన్షన్ , 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు ఇవ్వాలని కోరారు. ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.