MNCL:హోలీ పండుగ పురస్కరించుకొని కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద ప్రాణహిత నదిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. నది లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని, ఎవరూ స్నానాలకు రావద్దని సూచించారు. CI కృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ రవళి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్లను నది వద్ద కాపలా ఉంచారు. ప్రజలు సహకరించాలని కోరారు.