KMM: కూసుమంచి మండలం మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పాలేరు ఉద్యాన అధికారి పి.అపర్ణ తెలిపారు. మార్చి మాసంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రస్తుతం కాయలు బఠానీ గింజ పరిమాణంలో ఉన్నాయని, ఈ సమయంలో నల్లమచ్చ తెగులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.